భారతదేశం, ఏప్రిల్ 17 -- Stock market holiday: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 17, బుధవారం భారత స్టాక్ మార్కెట్ పని చేయదు. శ్రీరాముడి జన్మదినమైన శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూసివేయడంతో భారత ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు.

బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అధికారిక వెబ్సైట్లలో 2024 లోని ట్రేడింగ్ సెలవుల జాబితాలో ఏప్రిల్ 17, బుధవారం కూడా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు సెలవు ప్రకటించారు. అందువల్ల, ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్ఛేంజీలు పని చేయవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, వడ్డీ రేటు డెరివేటివ్స్ విభాగాల్లో ఈ రోజు ట్రేడి...