భారతదేశం, మార్చి 17 -- హోలీ కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లకు శుక్రవారం సెలవు. ఇక సెన్సెక్స్​, నిఫ్టీలు గురువారం ట్రేడింగ్​ సెషన్​​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 201 పాయింట్లు పడి 73,829 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 22,397 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 3 పాయింట్లు వృద్ధిచెంది 48,060 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 792.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1723.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

మార్చ్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 21,231.25 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26,450.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారం...