ఆంధ్రప్రదేశ్,శ్రీశైలం, ఫిబ్రవరి 18 -- మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. రేపటి నుంచే ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మార్చి ఒకటో తేదీతో ముగుస్తాయని. 11 రోజులు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మహాశివరాత్రి వేళ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. అందులోనూ శ్రీశైలం ప్రత్యేకమని చెప్పొచ్చు. సాధారణ భక్తులతో పాటు శివ మాల ధరించిన భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....