భారతదేశం, మార్చి 26 -- SRH Vs MI IPL Match : హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రేపు(మార్చి 27) సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్(SRH Vs MI Match) జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఐపీఎల్(IPL 2024) మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లను రాచకొండ సీపీ తరుణ్ జోషి పర్యవేక్షించారు. మొత్తం 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో 39 వేల సీటింగ్ కెపాసిటీ ఉందని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బుధవారం రాత్రి జరిగే ఈ మ్యాచ్‌ కోసం స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు.

ఐపీఎల్ మ్యాచ్(Uppal IPL Match) వీక్షించేందుకు వచ్చే ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్, ల్యాప్‌ ట్యాప్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, బైనాక్యులర్స్, సిగరెట్లు తీసుకుర...