Hyderabad, ఫిబ్రవరి 10 -- స్పైసీ ఫుడ్ అనేది చాలా మందికి ఇష్టం. పచ్చళలు, బిర్యానీలు, కూరలు వంటివి కారంగానే ఉండాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు అనుకోకుండా ఎక్కువ స్పైసీగా తింటారు. లేదా పచ్చిమిరపకాయను నమిలేస్తూ ఉంటారు. ఆ సమయంలో నోరు మంటగా మారడమే కాకుండా ఈ మసాలా కడుపులో చికాకు కలిగిస్తుంది. విపరీతమైన దగ్గు, మంట కూడా వస్తుంది. ఆ కారాన్ని తట్టుకోలేక కొంతమంది విపరీతంగా నీరు తాగేస్తారు. అయినా కూడా మంట తగ్గదు. అలాంటప్పుడు చిన్న చిన్న చిట్కాల ద్వారా మంటను తగ్గించుకోవచ్చు.

కారం ఎక్కువైతే కంటి నుంచి నీరు రావడం మొదలవుతుంది. నోటిలో మంట తగ్గాలంటే కొన్ని రకాల పదార్థాలు సహాయపడతాయి. ఇవి నోటిలోని కారాన్ని వేగంగా తగ్గిస్తాయి. నిజానికి మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల మిరపకాయలో ఉండే కాపుచిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది నాలిక మీద ఉన్న కణజాలాలతో సంబంధంలోకి వస్...