భారతదేశం, మార్చి 23 -- Somu Veerraju : ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై...ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక పెద్ద గుంట నక్క అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. రాత్రి పూట నిద్రపోని, ఊగిపోయే గుంట నక్క కేసీఆర్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.... కొడుకు, కూతురు, మేనల్లుడి అభివృద్ధినే కేసీఆర్ కోరుకుంటారని అన్నారు. బీజేపీ నేతలు గుంట నక్కలు కాదని, రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంటారన్నారు. బీజేపీ ఎప్పుడూ అభివృద్ధి చేసేందుకు అధికారం సాధించాలని కోరుకుంటుందన్నారు.

"కేసీఆర్ కల్లబొల్లి కబుర్లు చెప్పి తెలంగాణను పదేళ్లు పాలించారు. మాయ మాటల మరాఠీ కేసీఆర్. ఇప్పుడు జనం నమ్మకపోవడంతో బీజేపీపై అసత్య ఆరోపణలు ...