భారతదేశం, ఏప్రిల్ 20 -- Smartphones discounts: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఏప్రిల్ నెలలో వన్ ప్లస్, షియోమీ, ఆపిల్ వంటి ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ పాపులర్ ఫోన్ల ధరలను తగ్గించాలని నిర్ణయించారు. భారీ డిస్కౌంట్ లభించే స్మార్ట్ ఫోన్స్ ఇవే..

వన్ ప్లస్ 11 5 జీ (OnePlus 11 5G) స్మార్ట్ ఫోన్ 2023 ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మోడల్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్, సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999 కాగా, ఇప్పుడు వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో, డిస్కౌంట్ అనంతరం కేవలం రూ.51,999 లకే లభిస్తుంది. ఈ వేరియంట్ ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ 35 స్...