భారతదేశం, మార్చి 25 -- SLBC Dead body: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచి కెనాల్‌లో మరో మృతదేహాన్ని గుర్తించారు. సొరంగం పై భాగం కూలిన తర్వాత 16వ రోజు పంజాబ్‌కు చెందిన టిబిఎం ఆపరేటర్‌ మృతదేహాన్ని గుర్తించారు. తాజాగా టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తించారు. బురదలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ఎస్‌ఎల్‌బిసిలో సహాయ చర్యల్ని కొనసాగించడంపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో మృతదేహం కనిపించింది. టన్నెల్‌ కూలిన సమయంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారిలో ఒక్కరి మృతదేహం మాత్రమే ఇప్పటి వరకు లభ్యమైంది. మంగళవారం రాత్రి మినీ హిటాచీతో మట్టి తవ్వి తీస్తుండగా... మృతదేహం లభ్యమైనట్టు సహాయ బృందాలు వెల్లడించాయి.

కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. మృతదేహాన్ని జాగ్రత్తా బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్...