భారతదేశం, మార్చి 28 -- వారిద్దరు ఆదివాసీల కోసం ఉద్యమం చేశారు. హక్కుల కోసం పోరాడారు. ఆకలి కోసం అలమటించిన వారికి అండగా నిలబడ్డారు. అమాయకుల కోసం కలబడ్డారు. వారు ఎవరో కాదు.. ప్రస్తుత మంత్రి సీతక్క (దనసరి అనసూయ), ఆమె భర్త కుంజ రాము. వీరిద్దరు ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో.. సీతక్క ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నారు. కానీ ఆమె భర్త కుంజ రాము వీర మరణం పొందారు. 2004 మార్చి 27న ఆయన చనిపోయారు. కుంజ రాము గురించి 10 ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి.

1.కుంజ రాముది ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లి గ్రామం. ఆయన ఆదివాసీ లిబరేషన్ టైగర్ (ALT) వ్యవస్థాపకుడు. గతంలో మావోయిస్టుగా పనిచేసిన ఆయన.. 2004లో మరణించారు. 2025 మార్చి 27న ఆయన 21వ వర్ధంతి జరిగింది.

2.మావోయిస్టుగా సీతక్కతో కలిసి కుంజ రాము పనిచేసారు. ఆ సమయంలోనే ఆదివాసీ లిబరేషన్ టైగ...