భారతదేశం, ఏప్రిల్ 4 -- Secunderabad Trains: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ది పనుల నేపథ్యంలో పలు రైళ్ల గమ్యస్థానాన్ని తాత్కలికంగా మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ అమృత్‌భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా పలు అభివృద్ధి పనుల్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగా పనులకు ఆటంకం కలగకుండా రైళ్ల గమ్యస్థానాన్ని మారుస్తున్నట్టు వివరించారు.

వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ చేరుకునే దాదాపు 10 రైళ్లు బోర్డింగ్‌‌ను ఇతర స్టేషన్లకు మార్చారు. తాత్కలికంగా ఈ రైళ్ల గమ్యస్థానాల్ని ఇతర స్టేషన్లకు మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం తెలిపింది. ఈ మేరకు రైల్వేబోర్డు నుంచి ఆమోదం వచ్చిందని పేర్కొంది.

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే పలు రైళ్ల రాకపోకల్ని సికింద్రాబాద్‌...