భారతదేశం, ఏప్రిల్ 3 -- SC on HCU Lands: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగైదు రోజులుగా సెంట్రల్ యూనివర్శిటీలోని 400ఎకరాల భూములను ఏపీఐఐసీ కేటాయించే నిర్ణయంపై విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన వ్యక్తమవుతోంది. తాజాగా సెంట్రల్ యూనివర్శిటీ భూముల్ని అన్యాక్రాంతం చేయొద్దంటూ విపక్షాలు గొంతు కలిపాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూముల్ని కాపాడాలని కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాకలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సెంట్రల్‌ యూనివర్శిటీలో చెట్లను నరకొద్దని ఆదేశించింది. తెలంగాణ హ...