భారతదేశం, ఏప్రిల్ 2 -- Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌‌లో గత వారం విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటనలో మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో కన్నతల్లే పిల్లలకు విషమిచ్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యలు జరిగినట్టు తొలుత ప్రచారం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిని ఆస్పత్రికి తరలించారు.

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో 27వ తేదీ రాత్రి విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందడం సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా పిల్లలకు విషం తినిపించి ప్రాణాలు తీసినట్టు మొదట భావించారు. ఈ ఘటనలో సాయికృష్ణ, మధు, గౌతమ్ అనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసే తండ్రి ఇంటికి వచ్చే సరికి భార్య రజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆస...