భారతదేశం, మే 2 -- Sangareddy fake Documents: సంగారెడ్డి జిల్లాలో నకిలీ వంశస్థులను,నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువ చేసే ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టును సి.సి.యస్ పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు 15 నుంచి 20 ప్లాట్లను అమ్మారని వాటి విలువ సుమారు 15 కోట్ల వరకు ఉంటుందన్నారు. నకిలీ ప్లాట్ లను కాజేసిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

దీనిపై బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కు చెందిన దుర్గా ప్రసాద్, సుబ్బరావు, రవిగౌడ్, అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో అమీన్పూర్, రామేశ్వరం బండ ప్రాంతంలో గత 20-25 సంవత్సరాలుగా ఖాళీగా వున్న ప్లాట్ లను గుర్తించారు.

ఆ స్థలాల అసలు యజమాని ఎవరని తెలుసుకుని రెండు మార్గాలలో స్థలాలను అమ్ముతున్నా...