భారతదేశం, మార్చి 28 -- Sangareddy Accident: వధువును తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ Tractor బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరి కొన్ని గంటల్లో పెళ్ళి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పెళ్లి కూతురిని Bride తీసుకు రావడానికి 30 మంది బంధువులతో కలిసి ఆనందంగా ట్రాక్టర్ లో బయలుదేరారు. మరికాసేపట్లో పెళ్ళి కూతురి ఇంటికి చేరుకుంటామనే లోపు ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో ముగ్గురు మృతి చెందారు. 27 మంది క్షతగాత్రులయ్యారు.

ఈ ప్రమాదంతో అప్పటి వరకు బంధువులతో కళకళలాడిన ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన సంగారెడ్డి Sangareddy జిల్లా మాన్సాన్ పల్లి శివారులో బుధవారం సాయంత్రం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచా...