భారతదేశం, మార్చి 25 -- సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని బయోమెట్రిక్ హాజరు రికార్డులను పరిశీలించారు. పదిమంది వైద్యులు తమకున్న క్యాజువల్ లీవుల పరిమితి కంటే ఎక్కువగా తీసుకున్నట్లు, రోజువారీ విధులకు గైర్హాజరైనట్టు కలెక్టర్ గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆదేశించారు.

అనుమతి లేకుండా ఎక్కువ రోజులు విధులకు రాని వైద్యాధికారులను.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సరెండర్ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బంది ఉదయం 9:15 గంటల వరకు విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

ప్రతి రోజు సిబ్బంది, వైద్యుల హాజరును పరిశీలించా...