భారతదేశం, మార్చి 15 -- Samantha: హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారింది. తొలి ప్ర‌య‌త్నంగా కామెడీ థ్రిల్ల‌ర్‌క‌థాంశంతో ఓ తెలుగు మూవీని తెర‌కెక్కించింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ శ‌నివారం రివీలైంది. ప్రొడ్యూస‌ర్‌గా స‌మంత డెబ్యూ మూవీకి శుభం అనే టైటిల్ క‌న్ఫామ్ చేశారు. అంతే కాకుండా సెలైంట్‌గా ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.

శుభం సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌సంత్ మ‌రిగంటి క‌థ‌ను అందించారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కామెడీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. న‌వ్విస్తూనే నెక్స్ట్ ఏం జ‌రుగ‌బోతుంద‌నే ఉత్కంఠ‌ను పంచేలా ఈ క‌థ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది....