భారతదేశం, మార్చి 28 -- Sagareddy Crime: సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌‌లో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించిన తల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో కన్నతల్లి కుటుంబ కలహాల కారణంగా పిల్లలకు విషం తినిపించి ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసే తండ్రి ఇంటికి వచ్చే సరికి భార్య రజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అప్పటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

అపస్మారక స్థితిలో ఉన్న రజితను బీరంగూడ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో విషం ఇచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు రజిత పోలీసులకు వివరించింది. గుర...