భారతదేశం, ఏప్రిల్ 2 -- హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి సందర్శనకు వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆసియాలోనే అతి పొడవైన రోప్‌వే నిర్మించబోతున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, హిల్ స్టేషన్‌లలో ట్రాఫిక్‌ను తగ్గించడం లక్ష్యంగా సిమ్లాలో 13.79 కి.మీ పొడవైన రోప్‌వేను నిర్మిస్తున్నారు. ఇది ఆసియాలోనే అతి పొడవైన రోప్‌వే ప్రాజెక్ట్ అవుతుంది.

ఈ ప్రాజెక్టును రోప్‌వే, రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) మోడల్ కింద హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి రూ.1,734.40 కోట్లతో చేపడుతోంది. ఇప్పటికే ఈ తారా దేవి-సిమ్లా రోప్‌వే ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి.

ఈ రోప్‌వే మాతా తారా దేవి, సంజౌలి మధ్య నడుస్తుంది. ఇది మొత్తం 60 కి...