భారతదేశం, మార్చి 25 -- నితిన్ హీరోగా నటించిన రాబిన్‍హుడ్ చిత్రం ఉగాది పండుగకు రెండు రోజుల ముందు మార్చి 28న విడుదల కానుంది. ఈ యాక్షన్ కామెడీ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. గతంలో నితిన్ - వెంకీ కాంబోలో వచ్చిన భీష్మ ప్రేక్షకులను మెప్పించి భారీ హిట్ కొట్టింది. దీంతో రాబిన్‍హుడ్‍పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా టికెట్లు ఏపీలో అదనపు ధరతో ఉండనున్నాయి.

రాబిన్‍హుడ్ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు మేకర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్‍పై రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్‍కు రూ.75 ధరను అదనంగా పెంచేందుకు అనుమతిని ఇచ్చింది. సినిమా రిలీజయ్యే మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు అధిక ధరలకు ఓకే చెప్పింద...