భారతదేశం, మార్చి 24 -- Rjy Double Murders: మైనర్‌ బాలికతో ప్రేమ వ్యవహారం సాగించిన యువకుడు ఆమె మరొకరితో చాటింగ్‌ చేస్తోందనే అనుమానంతో దారుణంగా హత్య చేసిన ఘటన రాజమహేంద్ర వరంలో జరిగింది. రెండ్రోజులుగా బాలికతో గొడవ పడుతున్న యువకుడు ఆదివారం ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు.

రాజమహేంద్రవరంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. ఏలూరు పట్టణంలోని ఏఎస్ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మా (38), ఆమె కుమార్తె మహ్మద్ సానియా ఎలియాస్ సానాలు (16) మూడు నెలలుగా రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో నివాసం ఉంటున్నారు. ఏలూరు జాంపేట ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మజీద్‌కు సల్మా రెండో భార్య కాగా మజీద్‌ మూడేళ్ల క్రితం మృతిచెం దాడు.

మజీద్‌ మొదటి భార్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు జాంపేటలో నివసిస్తుండగా సల్మా, సానియా రాజమండ్రిలో ఉంటున్న...