భారతదేశం, ఏప్రిల్ 2 -- Reliance CBG Plant: భారత్ లో 2035 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా సాంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ వినియోగానికి కృషి జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ రూ.65వేలకోట్లతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

రిలయన్స్ తొలి సీబీజీ ప్లాంట్ కు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏప్రిల్ 2వ తేదీన మంత్రి నారా లోకేష్, అనంత్‌ అంబానీలు కలిసి శంకుస్థాపన చేయనున్నారు. రిలయన్స్ ఆధ్వర్యంలో కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే మొదటి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ కు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అనంత్ అంబానీలు సంయుక్త...