భారతదేశం, మార్చి 20 -- Reddys Lab Molecule: శ్రీకాకుళం జిల్లా రెడ్డీస్ ల్యాబ్‌ పరిశోధనా కేంద్రంలో టైప్ 2 డయాబెటీస్‌ ఔషధ మూలకం చోరీకి గురైంది. కోట్లరుపాయల ఖర్చుతో ఆవిష్కరించిన కెమికల్ మాలిక్యూల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు కేసు నమోదు చేశారు. టైప్ 2 మధు మేహ నియంత్రణ కోసం కొత్త రకం ఔషధాన్ని రెడ్డీస్ ల్యాబ్స్‌ పరిశోధనా విభాగం ఆవిష్కరించింది. దాని మూలకాన్ని ల్యాబ్‌లో భద్రపరచగా అది మాయమైంది.

మధుమేహం నియంత్రణ పరిశోధనల్ని మలుపు తిప్పే ఆవిష్కరణ చోరీకి గురి కావడం కలకలం రేపుతోంది.ఏపీకి చెందిన దిగ్గజ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో టైప్ 2 డయాబెటిస్‌పై చేసిన పరిశోధనలు ఫలించి కొత్త రకం ఔషధాన్ని రూపొందించారు. ఈ ఔషధ తయారీకి సంబంధించిన కొత్త కెమికల్ మాలిక్యూల్ ను ఆవిష్కరించారు.

మధుమేహ చికిత్సల కోసం ఆవిష్కరించిన మూల...