Hyderabad, ఫిబ్రవరి 13 -- Rashmika Mandanna: రష్మిక మందన్నా.. ఇప్పుడో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. యానిమల్, పుష్ప రెండు పార్ట్ లతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పటికే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా ఆ ట్యాగ్ పై స్పందించింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ ట్యాగ్స్ వల్ల టికెట్లు అమ్ముడుపోవని అనడం గమనార్హం.
ఛావా మూవీ రిలీజ్ సందర్భంగా పీటీఐతో రష్మిక మాట్లాడింది. "ఇలాంటి ట్యాగ్స్ కెరీర్లో ఏమీ తోడ్పడవు. అవి కేవలం అభిమానుల ప్రేమ నుంచే వస్తాయి. వాళ్లు అలా పిలవాలనుకుంటారు.. పిలుస్తారు..
కానీ ఈ ట్యాగ్స్ కేవలం ట్యాగ్స్ మాత్రమే. మనం చేసే సినిమాలు, ప్రేక్షకుల ప్రేమే వాళ్లు కొనే టికెట్ల రూపంలోకి మారతాయి. అదే నాకు ప్రత్యేకం" అని రష్మిక అభిప్రాయపడింది.
ఇటు తెలుగు, అటు హిందీ సినిమాల్లో రష్మిక బిజీగా ఉంటున్న వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.