భారతదేశం, మార్చి 15 -- Ranya Rao: గతంలొ తను ఇచ్చిన స్టేట్మెంట్ పై కన్నడ నటి రణ్యా రావు యూటర్న్ తీసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తాను నిర్దోషినని డీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. గత వారం ఆమె నేరాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. బంగారం స్మగ్లింగ్ నేరంపై రెండు వారాల క్రితం ఆమెను అరెస్టు చేశారు.

డీఆర్ఐ అధికారులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, పలుమార్లు తన చెంపపై కొట్టారని, తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు తీసుకున్నారని డీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కు రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. ''రెండు వారాల క్రితం నన్ను విమానంలోనే అరెస్ట్ చేశారు. డీఆర్ఐ అధికారులు ఎంత బలవంతం చేసినా, నేను వారు రూపొందించిన వాంగ్మూలాలపై సంతకం చేయలేదు. దాంతో, వారు నాపై చేయి చేసుకున్నారు. చివరకు తీవ్ర ఒత్తిడికి లోనై నేను 40 ఖాళీ షీట్లతో పాటు సుమారు 50 నుంచి ...