భారతదేశం, ఏప్రిల్ 17 -- Ranam OTT: వైభ‌వ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా న‌టించిన త‌మిళ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ర‌ణం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఓవ‌ర్‌సీస్‌లో టెంట్‌కోటా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ర‌ణం మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది.

ర‌ణం అర‌మ్‌ థ‌వ‌రేల్ పేరుతో ఫిబ్ర‌వ‌రి 23న థియేట‌ర్ల‌లో రిలీజైంది. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్‌ల‌తో సాగిన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. వైభ‌వ్‌తో పాటు నందితా శ్వేత పాత్ర‌ల‌కు సంబంధించి వ‌చ్చే స‌ర్‌ప్రైజ్‌లు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ఐదు కోట్ల లోపు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ప‌దిహేను కోట్ల వ‌ర‌క...