భారతదేశం, మార్చి 2 -- ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా.. వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్‌ను.. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని.. దుబాయ్‌లో సునీల్ కుమార్ పర్యటించినట్టు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK 525 లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి.. 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK 526లో హైదరాబాద్ తిరిగివచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి EK 525 విమానంలో దుబాయి మీదగా అమెరికా వెళ్లి.. 2023 ఫిబ్రవరి 28 న EK 524 విమానంలో అమెరికా నుండి హైదరాబాద్‌కు దుబాయ్ మీదగా తిరిగి వచ్చారు. ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. డిసెంబర్ 14 2022 నుంచి డిసె...