భారతదేశం, ఏప్రిల్ 2 -- Thriller OTT: అప్స‌ర‌రాణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ రాచ‌రికం ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో ఏప్రిల్ 11న విడుద‌ల‌కానుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ల‌య‌న్స్ గేట్ ప్లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

రాచ‌రికం మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టించాడు. అప్స‌ర‌రాణికి జోడీగా విజ‌య్ శంక‌ర్ క‌నిపించాడు. ఈ తెలుగు మూవీకి సురేష్ లంక‌ల‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 31న‌ ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. రెండు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది.

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ‌, రివేంజ్, పొలిటిక‌ల్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌...