ఢిల్లీ, ఫిబ్రవరి 7 -- PM Modi in Rajya Sabha: 'అబ్ కీ బార్, 400 పార్' అంటూ కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రధాని మోదీ. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన మోదీ.. కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రాకపోవచ్చని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. సెటైర్లు విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40 సీట్లు గెలుచుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు చురుకలు అంటించారు.

"నేను మల్లిఖార్జున ఖర్గే 'అబ్ కీ బార్ 400 పార్' ప్రసంగం వింటున్నప్పుడు. అంతగా మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఎలా వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను. ఆ ఇద్దరు కమాండర్లు అక్కడ లేరని నేను గమనించాను. మాకు 400 సీట్లు రావాలని ఖర్గే ఆశించారు. ఖర...