భారతదేశం, ఫిబ్రవరి 11 -- Tollywood Piracy Crisis : టాలీవుడ్ ను పైరసీ భూతం వెంటాడుతోంది. ఏ సినిమా అయినా...థియేటర్లలో విడుదలైన గంటల వ్యవధిలో ఆన్ లైన్ లో దర్శనం ఇస్తుంది. పవన్ కల్యాణ్ అత్తారింటిది దారేది చిత్రం నుంచి తాజాగా విడుదలైన తండేల్ వరకు ఎన్నో చిత్రాలు పైరసీ బారిన పడినవే. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి వందల వంది టెక్నీషియన్లతో నెలల పాటు తీసిన చిత్ర బృందం కష్టాన్ని గంటల వ్యవధిలో బూడిదపాలు చేస్తున్నారు. పైరసీ వెబ్ సైట్స్, ఫ్యాన్స్ వార్...ఇలా కారణాలు ఏమైనా చివరికి నష్టపోయేది సినిమా నిర్మాతలే.

పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నా...ఎంత వరకూ ఆచరణలో ఉన్నాయన్నదే పెద్ద ప్రశ్న. ఎంత మంది నిందితులను చట్టం ముందు నిలబెట్టారనే ప్రశ్నలు తలెత్తు్తున్నాయి. టెక్నాలజీ సాయంతో రెచ్చిపోతున్న పైరసీ కేటుగాళ్లకు అడ్డుకట్ట వేయలేమా? అనే సందేహాలు మరో...