భారతదేశం, సెప్టెంబర్ 24 -- ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే, పబ్లిక్ ఇష్యూ (IPO)కి వెళ్లేందుకు సిద్ధమైంది. వాల్మార్ట్ మద్దతు ఉన్న ఈ ఫిన్టెక్ సంస్థ సుమారు రూ. 12,000 కోట్ల ($1.35 బిలియన్) ఐపీఓ కోసం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ వద్ద రహస్యంగా ముసాయిదా పత్రాలను దాఖలు చేసినట్లు 'రాయిటర్స్' నివేదించింది.
'రహస్య ప్రీ-ఫైలింగ్ రూట్' ద్వారా కంపెనీలు తమ ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) వివరాలను మొదట్లో ప్రజల నుంచి గోప్యంగా ఉంచుతాయి. దీని ద్వారా పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలా వద్దా అనే తుది నిర్ణయం తీసుకునే వెసులుబాటు కంపెనీకి లభిస్తుంది. డ్రాఫ్ట్ పత్రాలు దాఖలు చేసినంత మాత్రాన ఐపీఓకు వెళ్లడం తప్పనిసరి కాదు.
ఐపీఓకు వెళ్లేందుకు ముందు ఫోన్పే ఆర్థికంగా మరింత బలపడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన నష్టాలను తగ్గించుకుంది. అంతకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.