భారతదేశం, ఫిబ్రవరి 10 -- పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వడం మాత్రమే కాదు, రెండు కుటుంబాలు, రెండు మనసులు ఒకటవ్వడం. పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. అయితే ఆ బ్రేక్ ఇప్పుడు ముగిసిపోయే టైం వచ్చింది. త్వరలోనే పెళ్లి భాజలు మళ్లీ వినపడబోతున్నాయి. యువతీ యువకులు మూడు ముళ్లతో ఒకటయ్యే సమయం వచ్చేస్తుంది.

మూడు నెలల పాటు మూఢం కారణంగా పెళ్లి ముహూర్తాలు లేవు. పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. కానీ ఇక మళ్లీ పెళ్లి సందడిని చూడబోతున్నాము. ఈ నెల 19 నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని ఉన్నారు. మూడు నెలల బ్రేక్ తర్వాత ముహూర్తాలు రావడంతో మళ్లీ శుభకార్యాల సందడిని చూడబోతున్నాము.

గత సంవత్సరం నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 13 దాకా మూఢం ఉండడంతో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగలేదు. పెళ్లిళ్లు మళ్లీ జరగడానికి ప్రిపరేషన్ కూడా మొదలయ్...