భారతదేశం, ఏప్రిల్ 10 -- Peddapalli Suicides: పెద్దపల్లి జిల్లాలో బిడ్డకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన లోక వేణుగోపాల్ రెడ్డికి అయిదేళ్ల కిందట కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన సాహితి(27)తో వివాహం అయ్యింది. వారికి ఏడాదిన్న వయసున్న కూతురు రీతిన్య ఉంది.

పెద్దపల్లి ఎల్ఐసి కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వేణుగోపాల్ బుధవారం ఉద్యోగ రీత్యా జగిత్యాల కు వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్య, భార్య సాహితి ప్లాస్టిక్ తాడుకు వేలాడుతూ విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రిపూట తల్లికూతురు మృతదేహాలను పెద్దపల్లి ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు.

సాహితి మానసిక స్థితి సరిగా లేక గత కొంతకాలంగా ఇబ్బందిపడుతుందని అందులో బాగంగానే బిడ్డకు ఉరే...