భారతదేశం, మార్చి 25 -- కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్‌ ప్రవీణ్‌ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. తనకి ప్రాణహాని ఉందని ప్రవీణ్‌ నెల కిందటే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక.. అనుకోని ప్రమాదంలో మృతి చెందారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే.. ఆయనది హత్యేనని.. క్రైస్తవ ఆరాధకులు, ప్రవీణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆయనను బెదిరిస్తూ ఉన్న వీడియోలను చూపిస్తున్నారు. ప్రవీణ్ పెదాలు కమిలిపోయి ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు క్రైస్తవులు, అతని బంధువులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ నుండి ప్రమాద స్థలం వరకు ప్రవీణ్‌ ప్రయాణానికి సంబంధించి మొత్తం సిసిటివి ఫుటేజ్‌ని పరిశీలించాలని.. క...