భారతదేశం, మార్చి 31 -- Pastor Death Case: రాజమహేంద్రవరం సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తూ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో నాలుగు గంటల పాటు అదృశ్యం కావడం వెనుక మిస్టరీ వీడింది. మహానాడు జంక్షన్‌ నుంచి 500మీటర్లలోపు ఉన్న రామవరప్పాడు మధ్య మూడున్నర గంటల పాటు అదృశ్యం కావడం వెనుక కారణాన్ని గుర్తించారు.

మార్చి 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్‌ విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ క్రమంలో దారి పొడవున సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలో విజయవాడ ట్రాఫిక్ పోలీసులు 25వ తేదీ మధ్యాహ్నం తీసిన ఫోటోల్లో పాస్టర్‌ను గుర్తించారు.

జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ సొమ్మసిల్లిపోయిన పాస్టర్‌ ప్రవీణ్ తన ద్విచక్ర వాహనాన్ని ఆపేసి రోడ్డు పక్కన కూర్చున్నాడు. రామవరప్పాడు రింగ్‌ సమీపంల...