భారతదేశం, మార్చి 25 -- Parking Free: ఆంధ్రప్రదేశ్‌లో షాపింగ్‌ మాల్స్‌‌లో పార్కింగ్‌ ఫీజు పేరుతో అడ్డగోలు దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. పార్కింగ్‌ ఫీజులపై స్పష్టత ఇస్తూ జీవో నంబర్ 44 ను పురపాల శాఖ సోమవారం విడుదల చేసింది. ఇకపై మాల్స్‌లో షాపింగ్‌ బిల్లు, సినిమా టికెట్ ఉంటే పార్కింగ్ సదుపాయాన్ని ఉచితంగా కల్పించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా పార్కింగ్ ఫీజుల పేరుతో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. దీనిపై వినియోగదారుల కమిషన్లు, న్యాయస్థానాల్లో కేసులు నమోదైనా నిబంధనల్లో ఉన్న లొసుగుల్ని అడ్డు పెట్టుకుని షాపింగ్ మాల్స్‌ ప్రజల నుంచి పార్కింగ్‌ పేరుతో వసూళ్లు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలకు కనీస ధర రూ.20, కార్లకు రూ.50గా నిర్ణయించి గంటల లెక్కలో వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి మాల్స్‌ దోపిడీపై ప్రభుత్వానికి భారీగా ఫి...