భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ సర్వం మాయ అదరగొడుతోంది. క్యూట్ దెయ్యం కథతో వచ్చిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఏకంగా మూడు భాషల్లో ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ మూవీగా ట్రెండ్ అవుతోంది. ఇందులో నివిన్ పౌలీ హీరో. ఈ మూవీపై నెట్టింట్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సర్వం మాయ ఓటీటీని షేక్ చేస్తోంది. జనవరి 30, 2026న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది ఈ హారర్ థ్రిల్లర్. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సినిమాలో నివిన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్ తదితరులు నటించారు.

మలయాళ మూవీ సర్వం మాయ ఇప్పుడు ఓటీటీలో మూడు భాషల్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు తెలుగు, మలయాళం,...