భారతదేశం, మార్చి 3 -- విదాముయర్చి చిత్రం భారీ అంచనాలతో వచ్చినా.. ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయింది. సీనియర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొంగల్కే రావాల్సిన మూవీ వాయిదా పడింది. తెలుగులో పట్టుదల పేరుతో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పుడు ఈ విదాముయర్చి చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది.
విదాముయర్చి చిత్రం నేడు (మార్చి 3) నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. అనుకున్న దాని కంటే ముందే ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
విదాముయర్చి చిత్రం కమర్షియల్గా నిరాశపరిచింది. రూ.200కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చింది. అయితే, మొదటి నుంచే మిక్స్డ్ టాక్ దక్కించుకుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.