భారతదేశం, మార్చి 15 -- OTT Mystery Thriller: క‌న్న‌డ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ క‌ప్పు బిలుపిన న‌డువే సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రెంట‌ల్ విధానంలో రిలీజ్ చేశారు. థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ ఇర‌వై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.

క‌ప్పు బిలుపిన న‌డువే సినిమాలో వ‌సంత్ విష్ణు హీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విద్యా శ్రీ గౌడ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో క‌న్న‌డ సీనియ‌ర్ యాక్ట‌ర్ శ‌ర‌త్ లోహితస్వ కీల‌క పాత్ర పోషించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తితో క‌ప్పు బిలుపిన న‌డువే సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌మోష‌న్స్‌లో వెల్ల‌డించాడు. ఫిబ్ర‌వ‌రి 23న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రి...