భారతదేశం, జనవరి 27 -- హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ 'రజాకార్' ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా గతేడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. పది నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. నిజాం పాలకుల దురాగతాల ఆధారంగా అప్పటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక, అనసూయ భరద్వాజ్, మకరంద్ దేశ్‍పాండే ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో రజాకార్ మూవీకి అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు. అయితే, ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి.

రజాకార్ చిత్రం జనవరి 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు అందుకు రెండు రోజుల ముందే అందుబాటులోకి వచ్చింది. ఆహాలో రజాకార్ చిత్రానికి భారీ వ్యూస్ దక్కుతున్నాయి. రజాకార్ చిత్రం ఆహా ఓటీటీలో 30 మిలియన్ స్...