భారతదేశం, ఏప్రిల్ 6 -- హిందీ హారర్ థ్రిల్లర్ మూవీ 'చోరీ 2'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆసక్తి రేపింది. నుష్రత్ బరుచా, సోహా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. 2021లో వచ్చిన చోరీకి సీక్వెల్‍గా ఈ చిత్రం తెరకెక్కింది. చోరీ 2 సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నుష్రత్.

చోరీ 2 సినిమాలో మార్కెటింగ్‍ కోసం పాటలు లేవని, కానీ కథ చాలా బలంగా ఉంటుందని నుష్రత్ తెలిపారు. భయపెట్టే హారర్ ఎలిమెంట్లతో పాటు కథ అద్బుతంగా ఉంటుందని చెప్పారు. "ఈ సినిమాలో పాపులర్ సాంగ్ మిస్ అయింది. అలాంటి మార్కెటింగ్ టూల్స్ ఈ చిత్రంలో ఉండవు. కానీ కథ అద్భుతంగా ఉంటుంది. పర్ఫార్మెన్సులపై మేకర్స్ నమ్మకం ఉంచారు. మంచి క్వాలిటీ చిత్రం క్రియేట్ చేయాలని అనుకున్నారు" అని...