భారతదేశం, ఫిబ్రవరి 24 -- టాలీవుడ్ పాపులర్ నటీనటులు రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓటీటీ వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు'. 'రెక్కీ', 'విరాటపాలెం' తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.

తెలుగు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జోనర్‌లో ఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ర్ రావు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ను మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. "'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' సిరీస్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుం...