భారతదేశం, మార్చి 21 -- ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్‌ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఫలితంగా తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. జవాన్లూ వీరమరణం పొందుతున్నారు.

1.సరిగ్గా వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం పనిచేస్తోంది. ఇందుకోసం ఆపరేషన్‌ కగార్‌‌ను ప్రారంభించింది. ఇది గతేడాది నుంచి ఆపరేషన్ ఊపందుకొంది.

2.ఆపరేషన్ కగార్ ప్రారంభమయ్యాక.. గురువారం నాటి రెండు ఎన్‌కౌంటర్లతో కలిపి ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య 120కి చేరింది. కేవలం 80 రోజుల వ్యవధిలోనే 120 మంది మరణించారు. ఈ తీవ్రతను పరిశీలిస్తే.. ఆపరేషన...