భారతదేశం, మార్చి 6 -- NTR TRUST Bhavan: ఇప్పటివరకూ హైదరాబాద్ నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా విజయవాడలో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. టీచర్స్‌ కాలనీలో ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవనానికి భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.

28 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ ను స్థాపించినప్పుడు చంద్రబాబు ఒకటే మాట చెప్పారని, ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని సూచించారన్నారు. ఏ నమ్మకంతోనైతే ఆయన ఈ బాధ్యతలు అప్పగించారో వాటిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నామన్నారు. మాటల్లో చెప్పింది చేసి చూపిస్తున్నామని ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానంటే అందుకు మా టీం సభ్యులే కారణన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము పేదలకు సేవ చేస్తున్నామంటే అందుకు దాతల సహకారం మరువలేనిదని, వి...