భారతదేశం, మార్చి 20 -- NPDCL Clarification: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఎన్పీడీసీఎల్‌ స్పష్టత ఇచ్చింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంట్ చార్జీల పెంపు పై సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల లేదని స్పష్టం చేశారు.

టైం ఆఫ్ డే ధరలలో కూడా ఎలాంటి మార్పు లేదనీ చెప్పారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జీలపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీ ఈఆర్సీ) హనుమకొండ కలక్టరేట్ లో బహిరంగ విచారణ చేపట్టింది.

టీజీ ఈఆర్సీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన బహిరంగ విచారణ జరగగా.. సంస్థ పరిధిలోని 17 జిల్లాల నుంచి భారతీయ కిసాన్ సంఘ్ న...