భారతదేశం, మార్చి 14 -- పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ద‌గ‌ద‌ర్తి మండ‌లం కేంద్రం అరుంధతీయ కాల‌నీకి చెందిన ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌భుత్వ ఉద్యోగి. ఆయ‌న తిరుప‌తి జిల్లా త‌డలో వెట‌ర్న‌టీ అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. భార్యా భ‌ర్త‌లు, పిల్ల‌ల‌తో కుటుంబం సంతోషంగా ఉంది. కానీ కొన్ని రోజులుగా కుటుంబంలో మ‌న‌స్ప‌ర్థ‌లు చోటు చేసుకున్నాయి.

అందుకు కార‌ణం.. ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌డ‌లో ఉద్యోగం చేస్తూ.. గుమ్మ‌డిపూడికి చెందిన మహిళతో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. మ‌రో మ‌హిళ‌తో భ‌ర్త వివాహేత‌ర సంబంధం పెట్టుకోవ‌డం తెలిసిన భార్య నిల‌దీసింది. ఆమెతో పాటు పిల్ల‌ల‌ు కూడా త‌న తండ్రి చేసే ప‌నిని ప్ర‌శ్నించారు. దీంతో భార్య, పిల్ల‌ల‌ను ఉమామ‌హేశ్వ‌ర‌రావు వేధించ‌డం మొద‌ల‌పెట్టాడు.

ఇంట్లో భార్య‌, పిల్ల‌లు నిలదీ...