భారతదేశం, ఏప్రిల్ 12 -- Nellore Ammonia Gas Leak : నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం రేపింది. జిల్లాలోని టీపీగూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా గ్యాస్ లీకై 10 కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. వాటర్‌ బేస్‌ కంపెనీలో అమోనియా గ్యాస్‌ లీకైంది. దీంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్‌ వ్యాపించిందని, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి తలుపులు, కిటికీలు వేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....