భారతదేశం, మార్చి 31 -- Nara Lokesh: విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన వరణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించ తలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్ కు మంత్రి లోకేష్ తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు.వైజాగ్ ఎల్లప్పుడూ మా హృదయానికి దగ్గరగా ఉంటుందని, ఈ నగరం కేవలం ఒక అందమైన తీరప్రాంతం మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిదన్నారు.

దశాబ్ధాలుగా వైజాగ్ మాకు అండగా నిలిచిందని ప్రపంచస్థాయి పెట్టుబడి గమ్యస్థానంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామని లోకేష్ చెప్పారు. గత పాలకుల విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారని అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లారన్నారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిలిచిపో...