భారతదేశం, ఏప్రిల్ 4 -- Nara Lokesh: బహిరంగ మార్కెట్ లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

మన ఇల్లు-మన లోకేష్.. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు బట్టలు పెట్టి మంత్రి నారా లోకేష్‌ శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. నేడు మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనా...