భారతదేశం, ఫిబ్రవరి 3 -- ముంబై సమీపంలోని ఉల్హాస్ నగర్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ శుక్రవారం రాత్రి శివసేన (ఏక్ నాథ్ షిండే) వర్గం నాయకుడు మహేష్ గైక్వాడ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటన హిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భూవివాదానికి సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. శివసేన షిండే వర్గం నాయకుడిపై కాల్పులు జరపడంతో గణపత్ గైక్వాడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహేష్ గైక్వాడ్ కి, అతని అనుచరుడికి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. కాల్పుల ఘటన జరగగానే కాల్పులకు పాల్పడిన గణపత్ గైక్వాడ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాధితుడైన మహేశ్ గైక్వాడ్ ను హుటావుటిన థానేలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే మహేశ్ గైక్వాడ్ కు చికిత్స ప్రారంభించిన వైద్యులు, అతడి శరీరంలోని...