భారతదేశం, జనవరి 3 -- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.. పోలీసులకు అప్పగించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా థరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం.. బతుకుదెరువు కోసం కొద్ది నెలల కిందట మొయినాబాద్‌కు వలస వచ్చింది.

ఆ కుటుంబం మొయినాబాద్ పెద్ద మంగళారంలోని ఓ విధిలో అద్దెకు ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె (4) గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన కైలాస్ (40) ఆ సమయంలో అటుగా వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కైలాస్.. ఆ బాలికను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

ఇది గమనించిన బాధితురాలి అక్క.. వెంటనే వెళ్లి తన నాన్నకు జరిగిన విషయం చెప్పిం...